శ్రీనివాస్ మరణం బాధించింది..కార్యకర్తలెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు

శ్రీనివాస్ మరణం బాధించింది..కార్యకర్తలెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు

పార్టీ కార్యకర్త శ్రీనివాస్ మరణం తనను ఎంతో బాధించిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. మెరుగైన చికిత్స అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ ను కాపాడుకోలేకపోయామన్నారు.  కార్యకర్తలెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు..  బ్రతికుండి పోరాటం చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంలో బండి సంజయ్ తో పాటు ఇతర బీజేపీ నాయకులు ఉదయం 11గంటలకు శ్రీనివాస్ అంతిమయాత్రలో పాల్గొంటారు.

అక్రమ అరెస్టులతో బిజెపి కార్యకర్తలను వేధించడం, రాజ్యాంగ హక్కులను హరించడంపై నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ రాష్ట్రశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్, మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించింది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా… భయపడకుండా ముందుకు సాగాలని కోరారు నేతలు.