రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఈ ఒక్క ఏడాదే

రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఈ ఒక్క ఏడాదే

టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు తీవ్రమైన మాసనిక ఒత్తిడితోనే  మా ఎంపీ దర్మపురి అర్వింద్ పై  దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిజామాబాద్ నందిపేట్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు బండి. కేసీఆర్..ఆయన కుటుంబసభ్యులు ఏం త్యాగాలు చేశారని ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీకి  అధికారం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని..ఈ ఒక్క ఏడాది మాత్రమే టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని.. ఆ తర్వాత కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎంపీ అర్వింద్ పై దాడి చేస్తారని ముందుగానే డీజీపీకి, సీపీకి తెలుసునని అన్నారు బండి సంజయ్. సీఎం కార్యాలయం దర్శకత్వంలో నిజామాబాద్ సీపీ నేతృత్వంలోనే పోలీసు అధికారులు దాడి చేశారని ఆరోపించారు. ఓ ఎంపీపై దాడి చేస్తే  ఇప్పటి వరకు కేసు కూడా నమోదు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై కత్తులతో దాడులు చేశారని, హత్యాయత్నం చేసిన వారు బహిరంగంగా తిరుగుతున్నారని ఆరోపించారు. నిజాం కాలంలో కూడా ఇంత నిర్బంధం చూడలేదని పెద్దమనుషులు చెబుతున్నారని అన్నారు బండి. 

మరిన్ని వార్తల కోసం...

ఇండియాలో ఒమిక్రాన్ సబ్‎వేరియంట్ బీఏ2