వడ్లు కొనుగోలు చేయండి.. కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

వడ్లు కొనుగోలు చేయండి.. కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

వడ్ల కొనుగోళ్లు, కాంటాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ప్రతి గింజా కొంటామని ప్రకటించి 15 రోజులు దాటుతుందని.. ఇప్పటి వరకు పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించాలని లేఖలో రాశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో గద్వాల్ లో 71 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా రెండు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారన్నారు బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 2 వేల 5 వందల కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కాంటాలు పెట్టి ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు. 

 

న్యాయం కావాలని ఎస్సై కాళ్లపై పడితే తన్నాడు