
హైదరాబాద్సిటీ/పద్మారావునగర్, వెలుగు: ఈ నెల 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 29న విజయవాడ దుర్గమ్మ, జులై 2న బల్కంపేట ఎల్లమ్మ , జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ, 10న సికింద్రాబాద్ మహంకాళి, 15న చార్మినార్, 17న లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బంగారు బోనాలు సమర్పిస్తామన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.
జులై 14న భవిష్యవాణి
బోనాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయాన్ని శుభ్రపరచి, రంగులు వేసే పనులు ఈ నెల 20లోగా పూర్తి చేయాలని ఈఓ ఆదేశించారు. ఈ నెల 29న ఘటోత్సవాలు, జూలై 13న బోనాల సమర్పణ, 14న రంగం (భవిష్యవాణి ) ఉంటుందని తెలిపారు.