మీర్పూర్ : టీ20 సిరీస్ గెలిచి జోరుమీదున్న ఇండియా విమెన్స్ టీమ్కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. గతంలో ఎప్పుడూ ఇండియాపై వన్డే మ్యాచ్ గెలవని బంగ్లా ఈసారి చరిత్ర తిరగరాసింది. నిగర్ సుల్తానా (39), ఫర్జానా హక్ (27) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్లో 40 రన్స్ (డక్వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో ఇండియాపై నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0 లీడ్లో నిలిచింది. వర్షం వల్ల 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 152 రన్స్కు ఆలౌటైంది.
ALSO READ :పేదరికం అంచనాలు వేసే ప్రణాళిక సంఘం
ఇండియా బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్ 4, దేవికా వైద్య 2 వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 35.5 ఓవర్లలో 113 రన్స్కే ఆలౌటైంది. దీప్తి శర్మ (20) టాప్ స్కోరర్. యాస్తికా భాటియా (15), అమన్జ్యోత్ కౌర్ (15) ఓ మాదిరిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరుఫా అక్తర్ 4, రెబయా ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగుతుంది.