బషీర్బాగ్, వెలుగు: కొరియర్ పేరుతో ఓ వ్యక్తిని సైబర్ చీటర్లు మోసగించారు. బంజారాహిల్స్కు చెందిన వ్యక్తి డీహెచ్ఎల్ కొరియర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బాధితుడికి కాల్ వచ్చింది. డెలివరీ కోసం రెండుసార్లు ప్రయత్నించమని, విఫలమైందని చెప్పారు. మరోసారి డెలివరీ కోసం రూ.25 చెల్లించాలని ఓ లింక్ను పంపించారు.
నిజమేనని నమ్మి బాధితుడు ఆ లింక్ ను ఓపెన్ చేసి.. తన క్రెడిట్ కార్డు వివరాలు ఓటీపీ నమోదు చేశారు. వెంటనే అతని కార్డు నుంచి రూ.2,49,616 డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో ఖంగుతిన్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
