హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలో ఎండలు మండిపోతుండడంతో వాటర్ట్యాంకర్లకు భారీగా డిమాండ్పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా వెస్ట్సిటీలోని మాదాపూర్, కొండాపూర్, మణికొండ, కోకాపేట, గండిపేట, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, ఎస్ఆర్నగర్తదితర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, హాస్టళ్లతో పాటు ఇండ్లలోనూ బోర్లు ఎండిపోయాయి.
దీంతో వాటర్బోర్డు సరఫరా చేస్తున్న ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ఏర్పడింది. వారం క్రితం వరకూ రోజుకు 10 నుంచి 11 వేల ట్యాంకర్లు బుక్కాగా, రెండు మూడు రోజుల నుంచి రోజుకు 12 వేల నుంచి 13వేల ట్యాంకర్లు బుక్అవుతున్నాయి. దీంతో అధికారులు వాటర్ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు.
బార్కోడ్ ఐడియా..
పెరుగుతున్న డిమాండ్ను తట్టుకునేందుకు అధికారులు ట్యాంకర్ల సరఫరా పెంచాలనుకుంటున్నారు. ప్రస్తుతం 80 ఫిల్లింగ్స్టేషన్ల నుంచి 1250 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లు పక్కదారి పడుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రతి ట్యాంకర్ టోకెన్పై ‘బార్ కోడ్’ పెట్టాలని నిర్ణయించారు. దీని వల్ల వాటర్ట్యాంకర్ల లెక్కలు కచ్చితంగా ఉంటాయంటున్నారు.
ఈ విధానంలో ప్రతి ఫిల్లింగ్ పాయింట్ దగ్గర బార్ కోడ్ స్కాన్ చేశాకే ట్యాంకర్ బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. రోజుకు ఎన్ని ట్యాంకర్లు బుక్అవుతున్నాయి..? డెలివరీ ఎన్ని అవుతున్నాయన్నది స్పష్టంగా తెలుస్తుందని అధికారులు అంటున్నారు. ట్యాంకర్ల నిర్వహణలో పారదర్శకత కోసం ప్రతి ఫిల్లింగ్స్టేషన్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వీటిని హెడ్డాఫీసుకు లింక్చేసి పరిశీలిస్తున్నారు.
