
- 90 రోజుల్లో బార్లు ఏర్పాటు చేయాలి
- ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్
హైదరాబాద్సిటీ/గండిపేట, వెలుగు: గ్రేటర్పరిధితో పాటు రూరల్ఏరియాలో 28 బార్లకు శుక్రవారం ఎక్సైజ్కమిషనర్హరికిరణ్ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. నార్సింగిలోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్లో 24 బార్లకు మొత్తం 3,525 దరఖాస్తులు రాగా, కమిషనర్ డ్రా బాక్స్ లోని కాయిన్స్ తీసి జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రికి ఇచ్చారు. ఆయన నంబర్లను వెల్లడించారు.
డ్రాలో పేర్లు వచ్చిన వారికి అలాట్మెంట్ లెటర్లను అందజేశారు. 90 రోజుల్లో ప్రాసెస్పూర్తి చేసి బార్లు నడిపించుకోవాలని కమిషనర్సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్లు పి.దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డి
పాల్గొన్నారు.