బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య

బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రామాటి ప్రవీణ్ కుమార్ ఈరోజు(నవంబర్ 26) బాలుర వసతి గృహంలోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా.. విద్యార్థి తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం అందించారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని భైంసా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.