బాసర ట్రిపుల్ ఐటీలో కరెంట్ కట్..విద్యార్థుల ఇబ్బందులు

బాసర ట్రిపుల్ ఐటీలో కరెంట్ కట్..విద్యార్థుల ఇబ్బందులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అంధకారంలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి క్యాంపస్ లో కరెంట్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యాంటీన్లలో క్యాండీల్స్ వెలుతురు మధ్యలో విద్యార్థులు భోజనం చేశారు. అయితే ట్రాన్స్ఫార్మర్ వద్ద సమస్య ఉందని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక క్యాంపస్ లో ఉన్న భారీ సోలార్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడం గమనార్హం.

కాగా ఆదివారమే బాసర ట్రిపుల్ ఐటీని గవర్నర్ సందర్శించి..విద్యార్థుల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్..విద్యార్థుల డిమాండ్లు చాలా సింపుల్ గా ఉన్నాయన్నారు. విద్యార్థులకు మంచి క్వాలిటీ భోజనం అందించాలని సూచించారు. అమ్మాయిలకు భద్రత విషయంలో సమస్య ఉన్నట్లు తెలిసిందన్నారు. సిబ్బంది కొరత కూడా ఉందని..మెస్ ల విషయంలో పిల్లలు సంతోషంగా లేరని చెప్పారు. ఇవాళ్టి నుంచి ఒక్కో సమస్య తీరుతుందన్న నమ్మకం ఉందన్నారు.