
- నకిలీ బాస్మతీ రైస్ను గుర్తించాలే
- ప్రజల్లో అవగాహన కలిపించేందుకు ‘బాస్మతీ రైస్ నో కాంప్రమైజ్’ కాన్క్లేవ్
హైదరాబాద్, వెలుగు: కేఆర్బీఎల్కు చెందిన ఇండియా గేట్ బాస్మతీ రైస్ బ్రాండ్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈట్ రైట్ ఇండియా ఇనీషియేటివ్ కలిసి నిర్వహించిన ‘బాస్మతీ రైస్ నో కాంప్రమైజ్’ కాన్క్లేవ్ గురువారం హైదరాబాద్లో ముగిసింది. బాస్మతీ రైస్ వినియోగం పెంచేందుకు, నకిలీ బాస్మతీ రైస్ను కట్టడి చేసేందుకు గత నెల రోజులుగా ఈ రెండు సంస్థలు రోడ్ షోలు నిర్వహించాయి.
రైస్కు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త స్టాండర్డ్స్ ఈ నెల ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చాయి. వీటిని కాన్క్లేవ్లో వివరించారు. రైస్లో ఎటువంటి ఎడిటివ్స్ను, ప్రిజర్వేటివ్స్ను వాడకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. ఈ సంస్థ తెచ్చిన స్టాండర్డ్స్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కాన్క్లేవ్లో ఇండస్ట్రీ ఎక్స్పర్టులు వివిధ అంశాలపై మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేక సందర్భాల్లోనే బాస్మతీ రైస్ వాడుతున్నారని వక్తలు అన్నారు.
ఈ రైస్ వినియోగం ఇంకా పెరగాలని చెప్పారు. కాగా, కిందటేడాది మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతీ రైస్ ఇండియాలో పండింది. ఇందులో 45 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతయ్యాయి. మిగిలిన 30 లక్షల మెట్రిక్ టన్నులు లోకల్ అవసరాల కోసం కేటాయించారు. ఇందులో 18.5 లక్షల మెట్రిక్ టన్నులను వివిధ బ్రాండ్లు అమ్మాయి. వీటిపై అనేక ఫుడ్ సేఫ్టీ టెస్ట్లు జరిగాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మిగిలిన 12 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రం లూజ్గా అమ్ముడయ్యాయని తెలిపాయి. ఈ ఈవెంట్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ కమలవర్ధన్ రావు, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ కమీషనర్ (తెలంగాణ) హరి చందనా దాసరి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెనూర్షిప్ డైరెక్టర్ హెచ్ఎస్ ఓబ్రాయ్ మొదలైన వారు పాల్గొన్నారు.