యూకేలో అక్టోబర్ 21న బతుకమ్మ సంబురాలు

యూకేలో అక్టోబర్  21న బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్, వెలుగు: భారత్​జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 21న యూకేలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. మంగళవారం బంజారాహిల్స్​లోని తన నివాసంలో భారత్​జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ పోస్టర్​ఆవిష్కరించి మాట్లాడారు.​జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ వేడుకలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. 

బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి వివిధ దేశాల్లోని జాగృతి కార్యకర్తలు కృషి చేశారన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షుడు బల్మూరి సుమన్, తెలంగాణ ఫుడ్స్​చైర్మన్​మేడె రాజీవ్​సాగర్, జాగృతి జనరల్​సెక్రటరీ నవీన్​ఆచారి తదితరులు పాల్గొన్నారు.