ట్యాంక్ బండ్ పై బతుకమ్మ సంబరాలు

ట్యాంక్ బండ్ పై బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ జలదృశ్యంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద బతుకమ్మ సంబరాలు అంబారాన్ని తాకాయి. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్ ఈ వేడుకలను ప్రారంభించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చిన్నారులు, మహిళలు ఆటపాటలతో అలరించారు.

ఈ సందర్భంగా దాసు సురేష్ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ నిదర్శమన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని చెప్పారు.