హైదరాబాద్, వెలుగు: ఎస్పీడీసీఎల్ లో గత 12 ఏండ్లలో జరిగిన నియామకాలు, ప్రమోషన్ల వివరాలు ఇవ్వాలని సీఎండీ జితేశ్ వి.పాటిల్ ను బీసీ కమిషన్ ఆదేశించింది. సోమవారం హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని ఎస్పీడీసీఎల్ ఆఫీస్లో సీఎండీ, డైరెక్టర్లతో కమిషన్ చైర్మన్ నిరంజన్, మెంబర్లు సురేందర్, బాలలక్ష్మి, జయప్రకాష్ రివ్యూ నిర్వహించారు.
ఎస్పీడీసీఎల్లో నియామకాలు, ప్రమోషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోందని పలువురు అధికారులు, ఉద్యోగులు బీసీ కమిషన్ కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ ఉందని కమిషన్ దృష్టికి సీఎండీ తీసుకెళ్లారు. పెండింగ్ కేసులకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలని సీఎండీని కమిషన్ చైర్మన్ ఆదేశించారు. బీసీ ఉద్యోగుల సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లేందుకు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలన్నారు. అలాగే డిస్కంలో బీసీ సెల్ ఏర్పాటుకు ఆఫీసు కేటాయించాలన్నారు.
