బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

2023–24 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కళాశాలలో ప్రవేశాల కొరకు నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలైయ్యాయి.  మంత్రిగంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశంలు ఈ ఫలితాలను విడుదల చేశారు. 

ఈ ఫలితాలలో ఎంపీసీలో 150 మార్కులకుగాను 122 మార్కులతో సిద్దిపేట్ జిల్లాకు చెందిన పి. జ్యోత్స్నమొదటి స్థానంలో నిలిచింది. బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పి.శ్రీవల్లి 108 మార్కులు సాధించింది. ఇక సీఇసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కె.సాయి సంహితకు 107 మార్కులు వచ్చాయి. ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఎ. అర్చన 109 మార్కులతో అగ్ర స్థానంలో నిలిచింది. జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కేటాయించిన కాలేజీలలో విద్యార్థలు చేరగలరని, ఫలితాలను https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చని సంస్థ కార్యదర్శి తెలిపారు.