బీసీ కులగణనను వెంటనే ప్రారంభించాలి : జాజుల

బీసీ కులగణనను వెంటనే ప్రారంభించాలి : జాజుల

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీసీ కుల గణనను వెంటనే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి జాజుల వినతి పత్రం సమర్పించారు.

కాంగ్రెస్ హామీనిచ్చిన విధంగా బీసీ కుల గణనను నిర్వహించి, బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతామన్న ఎన్నికల హామీని తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జాజుల మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలకు ముందే బీహార్ తరహాలో తెలంగాణలోనూ బీసీ సమగ్ర కుల గణనను చేపట్టిన తర్వాతనే సర్పంచి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని జాజుల తెలిపారు.