
న్యూఢిల్లీ: వరల్డ్ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా నిలిచిన బీసీసీఐ.. టైటిల్ స్పాన్సర్షిప్ విషయంలో మాత్రం ఫెయిలవుతోంది. ప్రస్తుతం మాస్టర్ కార్డుతో ఉన్న కాంట్రాక్ట్ ఈ సెప్టెంబర్తో ముగుస్తుంది. దీంతో కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బోర్డు ఐటీటీ (ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్)ని పిలిచింది. ఐపీఎల్ మీడియా రైట్స్ మాదిరిగా దీనికి కూడా భారీ డిమాండ్ ఉంటుందని భావించినా కార్పొరేట్ కంపెనీలు ఏమాత్రం స్పందించలేదు. దీంతో మాస్టర్ కార్డు ఒక్కో మ్యాచ్కు చెల్లిస్తున్న రూ. 3.8 కోట్లను 3 కోట్లకు తగ్గించింది. దీనికి కూడా స్పాన్సర్ల నుంచి ఆశించినంత స్పందన లేకపోవడంతో తాజాగా రూ. 2.4 కోట్లకు తగ్గించింది. ఐటీటీ కటాఫ్ తేదీ ఈ నెల 21 కాగా, సెప్టెంబర్ 15లోగా కొత్త టైటిల్ స్పాన్సర్ను ఎంపిక చేయాలని బోర్డు భావిస్తోంది.