Cricket World Cup 2023: రాత్రి 8 గంటల నుంచి సెమీస్, ఫైనల్ టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి

Cricket World Cup 2023: రాత్రి 8 గంటల నుంచి సెమీస్, ఫైనల్ టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి

ప్రస్తుతం వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ మరో గుడ్ న్యూస్ చెప్పేసింది. నాకౌట్ మ్యాచ్ లకు టికెట్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ రోజు (నవంబర్ 9) రాత్రి 8 గంటల నుంచి సెమీ ఫైనల్, ఫైనల్ టికెట్స్ ను ఆన్ లైన్ లో విడుదల చేయబోతుంది. https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Also Read :- పాక్ సెమీస్‪కు వస్తే ముంబైలో ఆడదు.. స్పష్టం చేసిన బీసీసీఐ

నవంబర్ 15 న మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరగనుండగా..  నవంబర్ 16 న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. టాప్ లో జట్టు, నాలుగు స్థానంలో జట్టుపై మొదటి సెమీస్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అదే విధంగా 2,3 స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. వీటిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలవడం ఖాయమైపోయింది. 

అగ్ర స్థానంలో ఉన్న టీమిండియాతో సెమీస్ లో తలపడేందుకు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి.ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నవంబర్ 12 న లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి.