
ముంబై: కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాల్కు, బ్యాట్కు మధ్య బ్యాలెన్స్ తెచ్చేందుకు బీసీసీఐ నడుం బిగించింది. ఇందుకోసం టీ20ల్లో ఓవర్కు రెండు బౌన్సర్లను అనుమతించనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 దేశవాళీ ట్రోఫీలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇప్పటిదాకా ఓవర్కు ఒక బౌన్సర్ను మాత్రమే అనుమతిస్తున్నారు.
అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న ఐదు నిర్ణయాలను బీసీసీఐ సెక్రటరీ జై షా శనివారం వెల్లడించారు. రెండు బౌన్సర్లతో పాటు ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐపీఎల్ మాదిరిగా ఏ టైమ్లో అయినా ఇంపాక్ట్ ప్లేయర్ను ఆడించేలా రూల్స్ను మార్చారు. ప్రస్తుత, మాజీ ప్లేయర్లు ఫారిన్ టీ20 లీగ్స్లో పాల్గొనే విషయంలో ఒక పాలసీని రూపొందించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక, సెప్టెంబర్లో జరిగే ఆసియా గేమ్స్లో క్రికెట్ పోటీల కోసం వన్డే వరల్డ్ కప్లో ఆడే ప్లేయర్లను కాకుండా ఇతరులను పంపిస్తామని తెలిపింది. దేశంలోని అన్ని క్రికెట్ స్టేడియాలను రెండు దశల్లో అప్గ్రేడ్ చేసేందుకు అపెక్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో వన్డే వరల్డ్ కప్నకు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలను అప్ గ్రేడ్ చేయాలని, తర్వాత మిగతా స్టేడియాల పనులు చేయాలని నిర్ణయించింది.