రూ.లక్ష పేరుతో బీసీలను మోసం చేస్తున్నరు : బీజేపీ నేత విఠల్

రూ.లక్ష పేరుతో బీసీలను మోసం చేస్తున్నరు : బీజేపీ నేత విఠల్

హైదరాబాద్, వెలుగు: రూ. లక్ష సాయం పేరుతో  బీసీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ ఆరోపించారు. ఎస్సీలకు దళిత బంధు ద్వారా రూ. 10 లక్షలు ఇచ్చి.. బీసీలకు మాత్రం కేవలం రూ. లక్ష మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడమేమిటని ప్రశ్నించారు.

మంగళవారం ఆయన పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ. లక్ష సాయం స్కీములో లోపాలు ఉన్నాయని విఠల్ వెల్లడించారు. ఆ వర్గంలోని కొన్ని కులాలకు మాత్రమే లక్ష సాయం అందుతుందని, మిగతావారి పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ కార్ల ర్యాలీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు.