సీజనల్ ​వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..రాష్ట్ర​హెల్త్ ​అండ్ ​ఫ్యామిలీ వెల్ఫేర్​ డైరెక్టర్ ​రవీందర్​

సీజనల్ ​వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..రాష్ట్ర​హెల్త్ ​అండ్ ​ఫ్యామిలీ వెల్ఫేర్​ డైరెక్టర్ ​రవీందర్​

జనగామ, వెలుగు: వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్​గా వచ్చే వ్యాధులపై మెడికల్​ఆఫీసర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హెల్త్​అండ్​ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్​రవీందర్ సూచించారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా మెడికల్​ఆఫీసర్​చాంబర్ ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం  జిల్లా మెడికల్, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో సమావేశమై  జాతీయ మెడికల్​కార్యక్రమాలపై సమీక్షించారు. టీబీపై  మాట్లాడుతూ నోటిఫికేషన్లను పెంచాలని మెడికల్​ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లాను అన్ని ప్రోగ్రామ్ ల్లో తొలిస్థానంలో నిలిపే విధంగా కృషి చేయాలని సూచించారు. 

 సీజనల్​వ్యాధులపై ఆశాలు, ఏఎన్​ఎంలతో ఫీవర్​సర్వేలు చేయించాలని పేర్కొన్నారు. జిల్లా మెడికల్​ఆఫీసర్లు తరచు పీహెచ్ సీలను  సందర్శించి తగు సిబ్బందికి సూచలను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు మెడికల్​ఆఫీసర్లు పాల్గొన్నారు.