
జనగామ, వెలుగు: వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్గా వచ్చే వ్యాధులపై మెడికల్ఆఫీసర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హెల్త్అండ్ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్రవీందర్ సూచించారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా మెడికల్ఆఫీసర్చాంబర్ ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జిల్లా మెడికల్, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో సమావేశమై జాతీయ మెడికల్కార్యక్రమాలపై సమీక్షించారు. టీబీపై మాట్లాడుతూ నోటిఫికేషన్లను పెంచాలని మెడికల్ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లాను అన్ని ప్రోగ్రామ్ ల్లో తొలిస్థానంలో నిలిపే విధంగా కృషి చేయాలని సూచించారు.
సీజనల్వ్యాధులపై ఆశాలు, ఏఎన్ఎంలతో ఫీవర్సర్వేలు చేయించాలని పేర్కొన్నారు. జిల్లా మెడికల్ఆఫీసర్లు తరచు పీహెచ్ సీలను సందర్శించి తగు సిబ్బందికి సూచలను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు మెడికల్ఆఫీసర్లు పాల్గొన్నారు.