జనవరి 31 నుంచి బీఈడీ కౌన్సిలింగ్..

 జనవరి 31 నుంచి బీఈడీ కౌన్సిలింగ్..

ఆంధ్రప్రదేశ్ లో బీఈడీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 27వ తేదీ శనివారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది.  జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.  గత ఏడాది జూలై 14న ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

అయితే, నెలలు గడిచినా కౌన్సెలింగ్ మాత్రం నిర్వహించలేదు. దీంతో బీఈడీ కళాశాల యాజమాన్యాలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాయి.  ఈ క్రమంలో విచారించిన హైకోర్టు.. వెంటనే బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించింది.  దీంతో ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల అయింది. రాష్ట్రంలో మొత్తం 411 బీఈడీ కాలేజీలు ఉండగా... 34 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.