
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ , నవరత్న కంపెనీ అయిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్ –1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 07.
- పోస్టుల సంఖ్య: 610
- పోస్టులు: ట్రైనీ ఇంజినీర్ 1– టీఈబీజీ 488, ట్రైనీ ఇంజినీర్ 1 – టీఈఈఎం 122.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో నాలుగేండ్ల బి.టెక్/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 24.
- లాస్ట్ డేట్: అక్టోబర్ 07.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 177.
- సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ అంశాలపై 85 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
- జీతం: రూ.30 వేల నుంచి 40 వేలు
- పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్లో సంప్రదించగలరు.