
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా బెల్లంపల్లి రీజియన్ నిలిచింది. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లోని జయశంకర్గ్రౌండ్లో మూడు రోజులు నిర్వహించిన క్రికెట్ఆఫ్ సింగరేణి ఎగ్జిక్యూటివ్టోర్నమెంట్సోమవారం ముగిసింది. సింగరేణివ్యాప్తంగా కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల నుంచి ఎగ్జిక్యూటివ్ టీమ్స్ పాల్గొన్నాయి.
ఫైనల్లో కొత్తగూడెం, బెల్లంపల్లి జట్ల మధ్య పోరు సాగింది. బెల్లంపల్లి రీజియన్ విజేతగా నిలిచింది. మహిళా ఎగ్జిక్యూటివ్ పోటీల్లో కొత్తగూడెం ఏరియా విజేతగా, రన్నర్గా బెల్లంపల్లి జట్టు నిలిచాయి. విజేతలకు సింగరేణి డైరెక్టర్డి. సత్యనారాయణ సోమవారం బహుమతులను అందజేశారు. జీఎం సీపీపీ మనోహర్, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి పాల్గొన్నారు.