బెంగాల్ ఫైల్స్‌‌ వెంటాడుతుంది

బెంగాల్ ఫైల్స్‌‌ వెంటాడుతుంది

‘ది కాశ్మీర్ ఫైల్స్‌‌’ సినిమాతో నైంటీస్‌‌లో కాశ్మీర్‌‌‌‌ పండిట్లపై జరిగిన ఊచకోతను కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.. ఇప్పుడు బెంగాల్‌‌లో జరిగిన రియల్‌‌ ఇన్సిడెంట్స్‌‌తో ‘బెంగాల్‌‌ ఫైల్స్‌‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. ‘బెంగాల్‌‌ మరో కాశ్మీర్‌‌‌‌లా మారుతోంది..  స్వతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ మత రాజకీయాలతో పోరాడుతున్నాం..’ అనే డైలాగ్స్‌‌తో మొదలైన టీజర్‌‌‌‌లో సినిమాలోని కీలకపాత్రదారులను ఒక్కొక్కరిగా పరిచయం చేశారు. 

క్యారెక్టర్స్‌‌లోని ఇంటెన్స్‌‌ సినిమా ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీని పెంచుతోంది. ‘ఒకవేళ మిమ్మల్ని కాశ్మీర్‌‌‌‌ బాధపెట్టి ఉంటే, బెంగాల్‌‌ మిమ్మల్ని వెంటాడుతుంది’ అని చివర్లో చెప్పిన మాటలు టీజర్‌‌‌‌కు హైలైట్‌‌గా నిలిచాయి. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌‌‌‌ 5న విడుదల కానుంది.