
బెంగళూరు: టెక్ కంపెనీ యాపిల్ బెంగళూరులో తన రిటైల్ స్టోర్ను ప్రారంభించనుంది. ముంబై, ఢిల్లీలలో తమ ఫ్లాగ్షిప్ స్టోర్లను ప్రారంభించిన తర్వాత, బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియాలో యాపిల్ తన కొత్త ఔట్లెట్ను ఏర్పాటు చేయనుంది. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్స్టాక్ రిపోర్ట్ ప్రకారం, యాపిల్ నార్త్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియాలో 7,997.8 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం రిటైల్ స్థలాన్ని పదేళ్లపాటు లీజుకు తీసుకుంది.