బెంగళూరు: తన వైఫ్ తనను కొడుతోందంటూ కర్నాటకకు చెందిన ఓ బాధితుడు.. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్(పీఎంవో)కు ట్వీట్ చేశాడు. తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. ఈ ట్వీట్ను పీఎంవోతో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్రెడ్డి, న్యాయ్ ప్రయాస్, ‘మెన్టూ’కు ట్యాగ్ చేశాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య.. అక్టోబర్ 29న ఈ ట్వీట్ చేశాడు.
‘‘నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఎందుకంటే నేను పురుషుడ్ని. నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. మీరు గొప్పగా చెప్పే నారీ శక్తి ఇదేనా? నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టొచ్చా? లేదా?” అంటూ ప్రశ్నించాడు. చంపేస్తానంటూ బెదిరిస్తోందని, తనకు రక్షణ కల్పించాలని కోరాడు. దాడిచేసినపుడు చేతికి గాయమైన ఫొటో ను కూడా యదునందన్ ట్విట్టర్లో పెట్టా డు. దీనిపై బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్రెడ్డి స్పందించారు. భయపడాల్సిన అవసరంలేదని యదునందన్కు ధైర్యం చెప్పారు. వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లాలని సూచించారు. కంప్లైంట్ చేస్తే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యదునందన్ ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. మరోవైపు, నెటిజన్ల నుంచి కూడా ఆచార్యకు మద్దతు లభిస్తోంది. భర్తలు ఎదుర్కొనే వేధింపులను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.