Loksabha Elections: బంపర్ ఆఫర్.. ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...

Loksabha Elections: బంపర్ ఆఫర్..  ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...

తమ పార్టీకే ఓటెయ్యాలంటూ రాజకీయ నాయకులు ఓటర్లకు తాయిలాలు పంచటం చూశాం కానీ, ఓటెయ్యాలంటూ స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు తాయిలాలు పంచటం చూశారా?, లేదు కదా.. బెంగళూరు వెళ్తే ఈ వినూత్న ట్రెండ్ చూడచ్చు.ఏప్రిల్ 26న కర్ణాటక, యూపీ రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పలు ప్రైవేట్ సంస్థలు ఈ ఐడియాలతో ముందుకు వచ్చాయి. నృపతుంగ రోడ్ లోని నిసర్గ హోటల్ లో ఓటర్లు ఇంక్ ఉన్న చూపుడు వేలు చూపిస్తే ఫ్రీగా బటర్ దోశ, గీ రైస్, ఒక కూల్ డ్రింక్ ఇస్తామని తెలిపింది యాజమాన్యం.

బెల్లందూర్ లోని  డెక్ అఫ్ బ్రూస్ అనే రెస్టో పబ్ ఓటర్లకు ఏప్రిల్ 27, 28వ తేదీల్లో ఓటర్లకు ఒక మగ్ బీర్ ప్లస్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. సోషల్ అనే మరో పబ్ కూడా ఓటర్లకు వారం రోజుల పాటు 20శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ ర్యాపిడో కూడా ఓటు హక్కు వినియోగించుకునే వృద్దులు, వికలాంగులకు ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తున్నట్లు తెలిపింది. పోలింగ్ జరిగే 26వ తేదీ మెట్రో రైళ్లు నడిచే సమయాన్ని కూడా పొడిగిస్తున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. ఏదేమైనా లాభాపేక్ష పక్కన పెట్టి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రైవేటు సంస్థలు చూపిస్తున్న చొరవ హర్షణీయం. 

Also Read:చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది