ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో జైలులో ఉంటేనే సేఫ్గా ఉంటావని ముంబై హైకోర్టు జడ్జి జీఎస్పటేల్ గురువారం చెప్పారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జితేందర్మిశ్రా వేసిన టెంపరరీ బెయిల్పిటిషన్ విచారణ సందర్భంగా జడ్జి ఈ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం సిటీలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బయట ఉండే కంటే జైలులో ఉంటేనే మంచిదని అన్నారు. బయట ఏం జరుగుతోందో మీకు తెలియదు, మునిసిపల్అధికారులు కంటే జైలు అధికారులే మెరుగైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతూ పిటిషనర్ టెంపరరీ బెయిల్ పిటిషన్ను నిరాకరించారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వారెంట్ పై బయటకు పంపించడం సరికాదు. సిటీలో చాలా ప్రాంతాల్లో సీరియస్ ఆంక్షలు ఉన్నాయి. తలోజా జైలు నుంచి ఒకరిని ఘట్కోపర్కు పంపించి వైరస్సోకే ప్రమాదానికి అనుమతించలేను’ అని అన్నారు.