ఐపీఎల్ చూస్తూ కొందరు జనాలు ఆనందిస్తుంటే.. మరికొందరు ఐపీఎల్ ను క్యాష్ చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా బెట్టింగ్కు పాల్పడుతూ.. కోట్లు పోగు చేసుకుంటున్నారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నా.. పందాలు కాయడం మాత్రం మానడం లేదు. తాజాగా బాచుపల్లి ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాచుపల్లిలో పక్కా సమాచారంతో బెట్టింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కు పాల్పడుతన్న వారిని రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. గణేష్ కుమార్, శ్రీనివాస్ రావు, రాంబాబు అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకులైన గణేష్, పాండు, రాజేష్ లు పరారీలో ఉన్నట్లు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 20,30,380 నగదుతో పాటు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగిస్తున్న ఎస్.బీ.ఐ బ్యాంక్ లో 2 లక్షల 20 వేలు రూపాయలను కూడా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ కు ఉపయోగిస్తున్న సామాగ్రిని కూడా సీజ్ చేశారు. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.