దొంగ లిస్టులను నమ్మకండి : బుడగం శ్రీనివాసరావు

దొంగ లిస్టులను నమ్మకండి : బుడగం శ్రీనివాసరావు

భద్రాచలం,వెలుగు : దొంగ లిస్టులతో ఓటర్లను మభ్య పెట్టేందుకు బీఆర్ఎస్​ లీడర్లు గ్రామాల్లోకి వస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దంటూ పీసీసీ మెంబర్​ బుడగం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దళితబంధు, బీసీ బంధు తదితర స్కీంలను ఎన్నికల కోడ్​ దృష్ట్యా నిలిపివేశారన్నారు.

కోడ్​ వస్తుందని తెలిసి లిస్టులను తయారు చేసి వాటిపై లోకల్ బీఆర్ఎస్ ​లీడర్ల సంతకాలు పెట్టించి గ్రామాల్లో దళితులను, బీసీలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ఈ లిస్టులను ఎన్నికల సంఘానికి పంపి ఫిర్యాదు చేస్తామన్నారు. పొదెం వీరయ్య గెలుపును అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో సరెళ్ల నరేశ్, బోగాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.