భద్రాద్రి ప్రధాన అర్చకుడు..కన్నుమూత

భద్రాద్రి ప్రధాన అర్చకుడు..కన్నుమూత

భద్రాచలం, వెలుగు: భద్రాచలం రామాలయం ప్రధాన అర్చకుడు పొడిచేటి గోపాలకృష్ణమాచార్యులు(58) సోమవారం హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.15 ఏళ్ల క్రితం శ్రీరామరథంతోపాటు ఆంధ్రాలోని చింతూరు మండలానికి ధర్మ ప్రచారానికి వెళ్తుండగా యాక్సిడెంట్​అయ్యింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్​చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన మృతితో ఆలయ అర్చకులు, ఉద్యోగులు సంతాపం ప్రకటించారు.