మావోయిస్టులు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నరు : ఓఎస్డీ సాయిమనోహర్​

మావోయిస్టులు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నరు  : ఓఎస్డీ సాయిమనోహర్​

భద్రాచలం, వెలుగు :  ప్రజాదరణ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మావోయిస్టులు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఓఎస్డీ సాయిమనోహర్​ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

సంత వ్యాపారులను దోచుకోవడం, అమాయక ప్రజల వాహనాలను అపహరించడం, దహనం చేయడం లాంటి బందిపోటు చర్యలతో ఉనికి కోసం మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పనిలేని కొందరు యువకులను ఆర్​పీసీ కమిటీల పేర్లతో నియమించి, పోలీస్​ ఇన్​ఫార్మర్ల నెపంతో చిరువ్యాపారులపై దారిదోపిడీ చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.