భగీరథ నీళ్లు వస్తలేవు

 భగీరథ నీళ్లు వస్తలేవు

మండల సభలో సర్పంచుల ఆవేదన

మెదక్​ (శివ్వంపేట), వెలుగు: భగీరథ నీల్లు వస్తలేవని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. శివ్వంపేట మండల ప్రజా పరిషత్ జనరల్​ బాడీ మీటింగ్​ శనివారం ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన జరిగింది. తమ గ్రామాల్లో నల్లా నీళ్లు సప్లై కావడం లేదని సికింద్లాపూర్ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, టిక్యా దేవమ్మ గూడ సర్పంచ్ తుక్యా, సీతారాం తండా సర్పంచ్ సోనీ తెలిపారు. రెడ్యా తండా సర్పంచ్ రంగీలా మాట్లాడుతూ తమ తండాకు రోడ్డు సరిగా లేదని, వర్షం పడితే మొత్తం బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందన్నారు. గ్రామాలలో కరెంట్​ సమస్యలు ఉన్నవిద్యుత్ ఆఫీసర్లు సహకరించడం లేదని వివిధ గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ డాక్టర్ జనరల్ బాడీ మీటింగ్ కు రాకపోవడంతో ఆయనపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని ఎంపీపీ హరికృష్ణ ఆదేశించారు.