ఆ రూమర్​ వల్లే సినిమాలు మానేశా : భాగ్యశ్రీ

ఆ రూమర్​ వల్లే సినిమాలు మానేశా : భాగ్యశ్రీ

బాలీవుడ్​లో ఒకే ఒక్క సినిమాతో కుర్రకారు కలల రాణిగా మారిపోయింది భాగ్యశ్రీ. సల్మాన్​ ఖాన్​తో చేసిన ‘మైనే ప్యార్​ కియా’ ఆమెకు మొదటి సినిమా. అదే చివరి సినిమా కూడా. ఆ తర్వాత సినిమాలకు గుడ్​బై చెప్పి ఫ్యాన్స్​కు ఊహించని షాకిచ్చింది. తాజాగా ఈ విషయంపై భాగ్యశ్రీ క్లారిటీ ఇచ్చింది.

 ఆ సినిమా టైంలో సల్మాన్ తో తనకు ఎఫైర్​ ఉందంటూ రూమర్లు స్ప్రెడ్​ అవ్వడం తనను తీవ్రంగా బాధించిందని తెలిపింది. తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన టైంలో ఓ జర్నలిస్టు బొకేతో వచ్చి తనను కలిసినట్టు తెలిపింది. 

‘మీ భార్యకు సల్మాన్​తో సంబంధం ఉంది.. ఇప్పుడామె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మీరెలా ఫీలవుతున్నారు’ అని తన భర్తను అడిగాడని ఆ ఒక్క ప్రశ్నతో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్టుగా వెల్లడించింది. ఇటీవల ‘రాధేశ్యాం’ సినిమాలో ప్రభాస్​కు తల్లిగా ఈ సీనియర్​ హీరోయిన్​ నటించిన విషయం తెలిసిందే.