హీరోయిన్‌‌గా టాలీవుడ్‌‌లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ కూతురు

హీరోయిన్‌‌గా టాలీవుడ్‌‌లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ కూతురు

పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ యాక్టర్లుగా ఎంట్రీ ఇస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌‌లో ఇది మరింత ఎక్కువ. ‘మైనే ప్యార్‌‌‌‌ కియా’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భాగ్యశ్రీ కూతురు అవంతికా దాసాని కూడా నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. ఆల్రెడీ ‘మిథ్య’ అనే వెబ్‌‌ సిరీస్‌‌లో నెగిటివ్ రోల్ చేసి అదరగొట్టిన అవంతిక.. ఇప్పుడు హీరోయిన్‌‌గా టాలీవుడ్‌‌లో అడుగుపెడుతోంది. బెల్లంకొండ గణేష్ హీరోగా రాఖీ ఉప్పలపాటి తెరకెక్కిస్తున్న ‘నేను స్టూడెంట్‌‌ సర్‌‌‌‌’ చిత్రంలో ఫిమేల్‌‌ లీడ్‌‌గా కనిపించబోతోంది. ఈ విషయాన్ని నిన్న అఫీషియల్‌‌గా అనౌన్స్ చేస్తూ ఆమె ఫస్ట్ లుక్‌‌ని కూడా విడుదల చేశారు. శ్రుతి వాసుదేవన్ అనే స్టూడెంట్‌‌ పాత్రలో నటిస్తోంది అవంతిక.

చేతిలో బుక్స్ పట్టుకుని మోడర్న్ లుక్‌‌లో ఉంది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్, చరణ్ దీప్, ప్రమోదిని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే మరిన్ని అప్‌‌డేట్స్‌‌ ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.