కాళహస్తిలో కన్నప్ప.. రూ.90 కోట్ల సినిమాను మొదలుపెట్టిన మంచు విష్ణు

కాళహస్తిలో కన్నప్ప.. రూ.90 కోట్ల సినిమాను మొదలుపెట్టిన మంచు విష్ణు

మంచు విష్ణు(Manchu Vishnu) చాలా గ్యాప్ తరువాత తన తరువాతి సినిమాను అనౌన్స్ చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ కన్నప్ప(Kannappa). భక్తిరస కథాంశంలో వస్తున్న ఈ సినిమాను ఆగస్టు 18న శ్రీ కాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు(Manchu Mohanbabu)తో పాటు చిత్ర యూనిట్ కూడా హాజరయ్యారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన మహాభారత(Mahabharatha) సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) తెరకెక్కించనున్న ఈ సినిమాలో..  బాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ నుపుర్ సనన్ (Nupur Sanon) నటిస్తున్నారు. ప్రముఖ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, సాయిమాధవ్, తోట ప్రసాద్ కథను అందించారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. 

ఈ సంధర్బంగా మాట్లాడిన మంచు విష్ణు.. భక్త కన్నప్ప, అతని భక్తి గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తామని, రెగ్యులర్ షూటింగ్ మొదలైన సింగల్ షెడ్యూల్లో సినిమా మొత్తం పూర్తి చేసి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు విష్ణు మంచు.