డయేరియాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్.. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేతో కలిసి ఫేజ్3 ట్రయల్స్

డయేరియాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్.. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేతో కలిసి ఫేజ్3 ట్రయల్స్

న్యూఢిల్లీ:   షిగెల్లోసిస్ (తీవ్రమైన బ్యాక్టీరియల్ డయేరియా) కోసం వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీతో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకున్నామని భారత్ బయోటెక్ గురువారం  ప్రకటించింది. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే  డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ క్యాండిడేట్ ఆల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1–2–3ను  ఇక నుంచి రెండు కంపెనీలు కలిసి డెవలప్ చేస్తాయి.  ఇది ప్రపంచంలోని అత్యాధునికమైన షిగెల్లా వ్యాక్సిన్ క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకటని భారత్ బయోటెక్ పేర్కొంది.  ప్రస్తుతం షిగెల్లాకు లైసెన్స్డ్ వ్యాక్సిన్ లేదు.  

ఇప్పటికే ఉన్న మందులకు  రెసిస్టెన్స్ పెరుగుతోంది. ఆల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1-–2–-3 వ్యాక్సిన్ ఇప్పటికే ప్రాథమిక క్లినికల్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మంచి రిజల్ట్స్ చూపించిందని భారత్ బయోటెక్ పేర్కొంది. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేతో కుదిరిన భాగస్వామ్యంలో భాగంగా  ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను , రెగ్యులేటరీ అప్రూవల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, పెద్ద మొత్తంలో తయారీని  భారత్ బయోటెక్ చూసుకుంటుంది.  

“షిగెల్లాకు ఇప్పుడు వ్యాక్సిన్ లేదు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతోంది. తక్కువ,మధ్య స్థాయి ఆదాయ దేశాలకు అర్జెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యాక్సిన్ కావాలి” అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.  క్లినికల్ ట్రయల్ డిజైన్, ఫండింగ్,  కమర్షియలైజేషన్ స్ట్రాటజీలో జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే  సపోర్ట్ చేస్తుంది.