
హైదరాబాద్: భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ ట్రయల్స్ మొదటి మెట్టు ఎక్కాయి. దేశవ్యాప్తంగా ఫేజ్1 ట్రయల్స్ మొదలయ్యాయి. 375 మందిపై వ్యాక్సిన్ను ప్రయోగిస్తున్నట్టు శుక్రవారం భారత్ బయోటెక్ ప్రకటించింది. ‘‘తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ ట్రయల్స్ను జులై 15న ప్రారంభించాం. డబుల్బ్లైండ్ ప్లాసిబో కంట్రోల్డ్ ట్రయల్స్ను 375 మందిపై చేస్తున్నాం’’ అని కంపెనీ ట్వీట్ చేసింది. డబుల్బ్లైండ్ ప్లసీబో పద్ధతి అంటే.. ఎవరికి ప్లసీబో ఇస్తున్నారో, ఎవరికి వ్యాక్సిన్ ఇస్తున్నారో అటు పేషెంట్కుగానీ, ఇటు రీసెర్చర్లకుగానీ తెలియదని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఓ వ్యక్తి శరీరంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించని డమ్మీ మందునే ప్లసీబో అంటారు. షుగర్ పిల్స్, సెలైన్ వంటి ఇనర్ట్ మెడికేషన్ను ప్లసీబోగా ఇస్తుంటారు. జబ్బుపై పేషెంట్లు ఎలా స్పందిస్తున్నారో, అది ఆ జబ్బుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు ప్లసీబోలను ఇస్తారు. ఇప్పటికే ప్రిక్లినికల్ ట్రయల్స్ కోవ్యాక్సిన్ మంచి ఫలితాలనిచ్చింది. పంద్రాగస్టునాటికి వ్యాక్సిన్ వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేజ్1 ట్రయల్స్ను కంపెనీ స్టార్ట్ చేసింది.