
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బర్త్డేను కాంగ్రెస్ లీడర్లు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భట్టిని కలిసి శాలువ కప్పి సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా మండల కేంద్రాల్లో స్థానిక నాయకులు భారీ కేకులు కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
పాల్వంచలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన ప్రజానాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. - వెలుగు, నెట్వర్క్