మెడికల్​ కాలేజీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి : భవేశ్​​ మిశ్రా

మెడికల్​ కాలేజీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి : భవేశ్​​ మిశ్రా

భూపాలపల్లి అర్భన్, వెలుగు:  మెడికల్  కాలేజ్ నిర్మాణ స్థలాన్ని చదును చేసి  నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్​​ మిశ్రా అర్ అండ్​ బీ ఆఫీసర్లను  ఆదేశించారు.  మంజూర్ నగర్ లో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి  కేటాయించిన భూమిని కలెక్టర్​  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ   టెండర్  ప్రాసెస్ ను పూర్తి చేసి  నిర్మాణ పనులను  చేపట్టాలని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్​ బీ ఈఈ వేంకటేశ్వర్లు, డీఈ రమేశ్​పాల్గొన్నారు.

 అపరిచితులకు వ్యక్తి గత వివరాలు చొప్పొద్దు.. మొబైల్ ఫోన్ లో  వ్యక్తి గత వివరాలు పూర్తి సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ భవేశ్​ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో  రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముద్రించిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్​ను  ఆవిష్కరించారు.  మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ జాగ్రత్త గా ఉండాలన్నారు.   ప్రజలు మొబైల్ ఫోన్ లో  వచ్చే   మెస్సేజ్ లను ఒకే అని కానీ,   ఓటీపీ ని గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎల్ తిరుపతి, అన్ని బ్యాంక్ ల మేనేజర్లు  తదితరులు పాల్గొన్నారు. 

ALSO READ : వరంగల్​ రైల్వే స్టేషన్​కు కొత్త హంగులు .. 25.41కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం