ఛీఛీ.. ఈ నీచులు ఎంత క్రూరంగా.. ముసలావిడ పై పైశాచికత్వం

ఛీఛీ.. ఈ నీచులు ఎంత క్రూరంగా..  ముసలావిడ పై పైశాచికత్వం

వయసు మీదపడి ఒంట్లో సత్తువ లేక, అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే వృద్ధులకు చేతనైతే కాస్త చేదోడువాదోడుగా ఉంగాలి.  పూటకింత బుక్కెడు బువ్వ పెట్టాలి. ఇంట్లో ఉన్న వృద్ధలపై జాలి, దయ చూపించాలి. కానీ.. మానవత్వాన్ని మరిచిన ఓ జంట ముసలావిడను క్రూరంగా హింసించారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని జహంగీరాబాద్‌లో  దీపక్ సేక్ హెయిర్ కటింగ్ (సెలూన్) షాప్ నడుపుతుంటాడు. ఆయన భార్య పూజ, వారి ఇద్దరి పిల్లలతో అదే ఊళ్లో నివసిస్తున్నారు. వృద్ధురాలైన  దీపక్ సేన్ అమ్మమ్మ(87) వారితోనే ఉంటోంది. దీపక్ సేన్, పూజా వృద్ధురాలిపై ఏ మాత్రం కనికరం లేకుండా నిత్యం కఠినంగా వ్యవహరిస్తుంటారు. అనేక ఆరోగ్య సమస్యలతో ఉన్న ముసలావిడ టైంకు భోజనం అడిగితే  దంపతులిద్దరూ కలిసి కొట్టేవారు. పూజ వృద్ధరాలిని తరుచూ చిత్రహింకలకు గురిచేసేది. కట్టేతో కొట్టి, పొడిచేది. 

ఇటీవల దీపక్ సేన్ ఇద్దరు పిల్లలు గొడవ పడుతుండగా వారిని బామ్మ మందలించింది. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియగా.. ఆ ముసలావిడపై పైచాచికంగా ప్రవర్తించారు.  పూజా, దీపక్ లు ఇద్దరూ కలిసి 87ఏళ్ల ముసలావిడపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి.. ఆ బామ్మ ప్రైవేట్‌పార్ట్‌లో చెక్కకర్రను చొప్పించి హింసించారు. వారు పెట్టే చిత్ర హింసలకు తట్టుకోలేక బామ్మ గగ్గోలు పెట్టి అరిచింది. అది చూసిన పక్కింటి వారు.. భార్యాభర్తల నిర్వాకాన్ని వీడియో తీశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన జహంగీరాబాద్‌ పోలీసుల దృష్టికి వెళ్లగా.. వారు కేసు నమోదు చేశారు. దీంతో దీపక్ సేన్, పూజా ఇల్లు వదిలి పరారీలో ఉన్నారు. ఈరోజు (మార్చి 27)న పోలీసులకు వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు. పోలీసులు విచారించి దీపక్ సేన్, అతని భార్య పాల్పడిన చిత్రహింసల గురించి తెలిపారు. వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు.