
తనిఖీల పేరుతో అర్చకులను వేధిస్తున్నారంటూ టీటీడీ అధికారులపై మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇటీవల ప్రధాన అర్చకుడి ఇంట్లో జరిగిన వివాహానికి హాజరైన ఓ ఉన్నతాధికారి ఇంతమంది వీవీఐపీలా అంటూ అవమాన చూపులు చూశారని... అర్చకుల పట్ల అంత చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు భూమన. ఇకపై ప్రతి ప్రధాన అర్చకులను తనిఖీ చేయాలని ఉన్నతాధికారి ఆదేశాలివ్వడంతో అర్చకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకులను తనిఖీ చేసినట్లు తనిఖీ చేస్తున్నారని ప్రధాన అర్చకులు మదన పడుతున్నారని అన్నారు.అర్చకుల ఘోష శ్రీవారి వింటున్నారని..అపచారం వల్ల వచ్చే కర్మ ఫలం వెంటాడుతుందని అన్నారు.సూర్యుని ప్రకాశం కంటే వేదం ప్రకాశం ఎక్కువని గ్రహించాలని.. వేదానికి మించిన సమాధానం మరొకటి లేదని అన్నారు భూమన.
తిరుమలలో 13 పీఠాలకు ఆశ్రమాల్లో అవకతవకలు జరిగాయని నోటీసులు పంపించారని.. ప్రతి పీఠం లో హోమం, అన్నదానం జరుగుతుంది, వీటిని ఆపేయాలని ఆదేశాల ఇచ్చారని అన్నారు. దీనిపై ఆర్ఎస్ఎస్ కు పిర్యాదు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెట్టిందని అన్నారు భూమన.