స్టేట్ ​ఫైనాన్స్ ​కమిషన్ ఛైర్మన్​గా భూపాల్​రెడ్డి

స్టేట్ ​ఫైనాన్స్ ​కమిషన్ ఛైర్మన్​గా భూపాల్​రెడ్డి
  • మరో రెండు కమిషన్​లకు ఛైర్మన్​ల నియామకం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్​ ఫైనాన్స్​కమిషన్ ​చైర్మన్​గా మండలి మాజీ ప్రొటెం చైర్మన్​ వి.భూపాల్​రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. పటానుచెరు నియోజకవర్గానికి చెందిన భూపాల్​రెడ్డి 2021 జూన్​ నుంచి 2022 జనవరి వరకు శాసన మండలికి ప్రొటెం చైర్మన్​గా పనిచేశారు.కాగా.. ఫైనాన్స్ ​కమిషన్ ​మెంబర్లుగా హైదరాబాద్​కు చెందిన గోసుల శ్రీనివాస్ ​యాదవ్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనెవట్లకు చెందిన మహ్మద్​సలీం నియమితులయ్యారు. 

తెలంగాణ స్టేట్ ​ట్రేడ్ ​ప్రమోషన్​కార్పొరేషన్ ​చైర్మన్​ సంగారెడ్డి జిల్లా వట్​పల్లి మండలం మర్వెల్లికి చెందిన మాటం భిక్షపతిని నియమించారు. తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్ ​కార్పొరేషన్ ​చైర్మన్​గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ​కొడుకు మహ్మద్​తన్వీర్​ను నియమించారు. మూడు కార్పొరేషన్​లకు నియమించిన చైర్మన్లు ఉమ్మడి మెదక్​జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే వీరి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రాత్రి పొద్దుపోయే వరకు విడుదల చేయలేదు.