ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీస్ అమరులను స్మరిస్తూ..సైకిల్ ర్యాలీలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీస్ అమరులను స్మరిస్తూ..సైకిల్ ర్యాలీలు

వెలుగు, నెట్​వర్క్​ : పోలీస్​ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం పోలీస్ అమరులను స్మరిస్తూ సైకిల్​ ర్యాలీలు నిర్వహించారు. నిజామాబాద్​లో సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో సైకిల్​, బైక్​ ర్యాలీలు నిర్వహించారు. పులాంగ్​ చౌరస్తా నుంచి ప్రధాన రోడ్ల మీదుగా నెహ్రూ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రాంచందర్​రావు, ఏసీపీలు రాజావెంకట్​రెడ్డి, మస్తాన్​అలీ తదితరులు ఉన్నారు.

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైకిల్​ యాత్ర నిర్వహించగా ఎస్పీ రాజేశ్​చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డితోపాటు పోలీస్​ అధికారులు, సిబ్బంది, 3 వందల మందివ విద్యార్థులు పాల్గొన్నారు. పొందూర్తి చౌరస్తా నుంచి  హౌజింగ్ బోర్డు కాలనీ, మెయిన్​ రోడ్డు,  నిజాంసాగర్​ చౌరస్తా, కొత్త బస్టాండు, డిగ్రీ కాలేజీ మీదుగా కళాభారతి వరకు సైకిల్​ యాత్ర కొనసాగింది. 

కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ విఠల్​రెడ్డి, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్స్, విద్యార్థులు పాల్గొన్నారు.   వర్ని మండల కేంద్రంలో ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు సుభాష్​చంద్రబోస్​ చౌరస్తా నుంచి జాకోరా క్రాసింగ్​ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.  నందిపేట మండల కేంద్రంలో ఎస్సై శ్యామ్​రాజ్​ ఆధ్వర్యంలో వివేకానంద చౌరస్తా నుంచి బస్టాండ్​ వరకు సైకిల్​ ర్యాలీ నిర్వహించారు.

 కార్యక్రమంలో ఎస్సై2, గ్రామస్తులు పాల్గొన్నారు. బోధన్​ పట్టణంలో సైకిల్​ ర్యాలీ నిర్వహించారు.  ఆచన్​పల్లి బైపాస్ నుంచి అనిసానగర్​, శక్కర్​నగర్​ చౌరస్తా, కొత్తబస్టాండ్​, అనిల్​ టాకీస్​ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.  కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్​, బోధన్​, రూరల్​, రుద్రూర్​ సీఐలు వెంకట నారాయణ, విజయ్​బాబు, కృష్ణ, ఎస్ఐలు చంద్రశేఖర్, మచ్ఛేందర్​ రెడ్డి, మహేశ్, రమా, సాయన్న, సునీల్​, పోలీసు సిబ్బంది, ఉషోదయ కాలేజీ, ఇందూర్​, విజయసాయి పాఠశాలల విద్యార్థులు  పాల్గొన్నారు.