తిరుమలలో భారీ నాగుపాము కలకలం

తిరుమలలో భారీ నాగుపాము కలకలం

తిరుమల కొండపై భారీ నాగు పాము కలకలం రేపింది. అలిపిరి-తిరుమల నడకమార్గంలో భక్తులకు శనివారం పాము కనిపించింది. మనిషికన్నా పొడువున్న ఈ పామును చూసి షాక్ అయ్యారు భక్తులు. పడిగ విప్పి బుసలుకొడుతూ పాము ఓ షాపులోకి దూరింది. వెంటనే యజమాని TTD అటవీశాఖ ఉద్యోగికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పామును పట్టుకున్నారు.

మనిషి కంటే ఎత్తుగా ఉన్న నాగుపామును పట్టుకుని దూరంగ అడవిలోకి వదిలిపెట్టారు అటవీ సిబ్బంది. పాము వల్ల ఎవ్వరికీ ప్రమాదంలో జరగలేదని తెలిపారు. ఇటీవల ఇంతపెద్ద పామును చూడలేదని తెలిపారు షాపుల యజమానులు.