ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. పీపుల్స్ పల్స్  ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి 100 నుంచి 115 సీట్లు వస్తాయని అభిప్రాయపడింది. అధికార జేడీయూ, ఎన్డీయూ కూటమికి 90 నుంచి 110 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీకి 3 నుంచి 5 సీట్లు వచ్చే చాన్సుందని చెప్పింది పీపుల్స్ పల్స్. ఈ ఎన్నికల్లో మహా ఘట్ బందన్ కు స్వల్ప ఆధిక్యత వచ్చే అవకాశముందని తెలిపింది. బీహార్ నెక్ట్స్ సీఎంగా తేజస్వీయాదవ్ వైపు 36 శాతం మంది మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం నితీష్ కు 34 శాతం మంది మద్దతిచ్చారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10 న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.