మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరిచేసి పారిపోతున్న ముగ్గురు దొంగలను ఓ ఎంపీ సినిమా లెవెల్లో ఛేజింగ్ చేసి మరి పట్టుకున్నారు. ఈ ఘటన బీహర్ లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆసుపత్రి నుంచి ఓ దంపతులు ఇంటికి వెళ్తుండగా, దొంగలు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరిచేసి పారిపోయారు. అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఔరంగాబాద్ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ ఇది గమనించి దొంగలు వెళ్తున్న వైపు వెళ్లామని తన కారు డ్రైవర్ కు సూచించాడు.
ఎంపీ కారు దొంగలకు దగ్గరగా వెళ్లగానే.. వారు అతని వైపు గన్ గురిపెట్టి కాల్చేస్తామని బెదిరించారు. అయినా సుశీల్ కుమార్ ఏ మాత్రం భయపడలేదు. ఆ దొంగలను విడిచిపెట్టకుండా అలాగే వారిని వెంబడించారు. దొంగలు వెళ్తున్న బైక్ బురదలో కూరుకుపోవడం వారు కిందపడ్డారు. ఆ వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్లు.. వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్ వరకు ఛేదించి ఆ దొంగలను పట్టుకున్నారు.
మహిళ వద్ద నుంచి లాక్కున్న గొలుసు వారి దగ్గర కనిపించకపోవడంతో గొలుసు ఎక్కడా అని పోలీసులు వారిని ప్రశ్నించారు. బైక్పై నుంచి కిందపడుతుండగా గొలుసు ఆక్కడే పడిపోయిందని దొంగలు చెప్పారు. అక్కడి వెళ్లి చూడగా గొలుసు కనబడడంతో మహిళకు అందజేశారు. నిందితులను టింకు కుమార్, ఆనంద్ కుమార్, ఠాకూర్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మే 05 శుక్రవారం రోజున బరున్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.