అచ్చంపేటలో బిహార్ పోలీసుల ఎంక్వైరీ... ఓ సైబర్ క్రైమ్ కేసులో వచ్చి తనిఖీలు

అచ్చంపేటలో బిహార్ పోలీసుల ఎంక్వైరీ... ఓ సైబర్ క్రైమ్ కేసులో వచ్చి తనిఖీలు

అచ్చంపేట, వెలుగు: సైబర్ క్రైమ్ కేసు నేపథ్యంలో బిహార్ పోలీసుల ఎంక్వైరీ నాగర్ కర్నూల్​జిల్లాలో కలకలం రేపింది. ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపిన ప్రకారం.. అచ్చంపేట టౌన్ కు చెందిన దొంగరి వెంకటరమణ శ్రీ బాలాజీ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతని కొడుకు అనిరుధ్​ఉన్నత విద్య పూర్తి చేసి హైదరాబాద్​లోని పలు ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తూ సైబర్ క్రైమ్ టెక్నాలజీపై పట్టు సాధించాడు. కాగా.. బిహార్ కు చెందిన పలువురి అకౌంట్ల నుంచి తండ్రి వెంకటరమణ, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన అతని భార్య అకౌంట్​కు దాదాపు రూ.2 కోట్లు మళ్లించినట్లు కేసు నమోదైంది. 

విచారణలో భాగంగా శుక్రవారం బిహార్ పోలీసులు అచ్చంపేటకు వచ్చి వెంకట రమణ మెడికల్ షాపు, ఇల్లు, బంధువుల ఇండ్లలో తనిఖీలు చేశారు. గతంలోనూ చెన్నై , బెంగళూరు పోలీసులు సైతం అచ్చంపేటకు వచ్చి విచారణ చేపట్టినట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన  పలువురి అకౌంట్ల నుంచి దాదాపు రూ.9 కోట్ల వరకు కాజేసినట్లు.. అనిరుధ్​కోసం వెతకగా ఆచూకీ దొరకలేదని ఎస్ఐ తెలిపారు.