
బీహార్లోని నవాడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ట్రక్కు అదుపుతప్పి నలుగురు కూలీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కూలీలంతా మార్కెట్ పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన నవాడ గయా రోడ్డులోని శోభియా అగ్రికల్చరల్ ఫామ్ సమీపంలోని కేవత్ నగర్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలీలంతా మార్కెట్ పనులకు నవాడకు వెళ్తున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సదర్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స ఇక్కడ కొనసాగుతోంది.